బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 13 : బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఎనలేని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామ దేవారం సాయిరెడ్డి డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో ఉన్న 50 కుటుంబాలు పోచారం వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి, స్పీకర్కు అందజేశారు.
వేల్పూర్/బాల్కొండ/మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం వేల్పూర్ మండలంలోని పోచంపల్లి గ్రామంలోని మాల సంఘానికి చెందిన 38 కుటుంబాలు, మాదిగ సంఘానికి చెందిన 24, గూండ్ల సంఘానికి చెందిన 21 కుటుంబాలు, బాల్కొండ మండలంలోని కిసాన్నగర్ గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ సంఘానికి చెందిన 32 కుటుంబాలు, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెంటే ఉంటామంటూ తీర్మానం చేశారు. తీర్మాన కాపీలను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు. మరోమారు అభ్యర్థులుగా ప్రకటించడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
వేల్పూర్, సెప్టెంబర్ 13 : మెండోరా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ జనరంజక పాలన.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు. జడ్పీటీసీ గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.