మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాకతీయ కాలువకు 2500 క్యూసెక్కులు నీటివిడుదల కొనసాగుతుందన్నారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ఉందని వెల్లడించారు. ఈ సీజనులో ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 679 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు.