కామారెడ్డి/కంఠేశ్వర్, ఫిబ్రవరి 8: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 జనవరి ఒకటో తేదీ నాటికి అర్హత కలిగిన ఓటరు తుది జాబితాను నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ గురువారం వేర్వేరుగా విడుదల చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తుది జాబితాను విడుదల చేసి వారికి అందజేశారు. తహసీల్ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లో నోటీసు బోర్డుపై ప్రదర్శించామని కలెక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.