మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్ట్ 3 వరద గేట్లతో దిగువ గోదావరిలోకి 9,360 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 3500 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతీ కాలువకు 800 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని తెలిపారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీల )సామర్థ్యం కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు (89.763 టీఎంసీల )నీటినిల్వ ఉందని వివరించారు. ఈ సీజనులో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్ లోకి 645.764 టీఎంసీల వరద నీరు వచ్చిందని తెలిపారు.