సుభాష్నగర్, మార్చి 11: ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ ప్రార్థనలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపునిచ్చారు.
ఆధ్యాత్మిక సౌరభాలు పరిమళించే వరాల వసంతం రంజాన్ రోజులు. పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించింది ఈ మాసంలోనే. ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన ప్రేమమూర్తిగా మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రతృత్వం, సహనశీలం, కోర్కెలను అదుపులో పెట్టుకొనే మనోశ్చలత, దయ, దానగుణం పెంపొందించుకోవడం రంజాన్ మాసం ప్రత్యేకత. ఉమ్మడి జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు.
బాన్సువాడ టౌన్, మార్చి 11: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిములకు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కలిసిమెలిసి జరుపుకోవాలని కోరారు.