కోటగిరి,డిసెంబర్ 17 : రాష్ట్రంలోని నిరుపేదలంద రికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో రూ.10.7 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ వైద్యశాల భవనానికి శనివారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. భవనాన్ని అన్ని వసతులతో నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలను వె చ్చించి వైద్య సౌకర్యాలను మెరుగుపరచడమే కా కుండా వైద్యాధికారులు, సిబ్బందిని నియమిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన వైద్య విభాగాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మెరుగుపరుస్తున్నారన్నారు. కోటగిరి మం డల కేంద్రంలో ఉన్న 10 పడకల దవాఖానను 50 పడకల వైద్యశాలగా అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్కు నివేదిక పంపామని, త్వరలో అనుమతి లభించనున్నదని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మే క శ్రీలక్ష్మీ వీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, వర్ని ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, సహకార సం ఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, సర్పంచు లు రాజు, పద్మా జగ్రాం, ఎంబడి పద్మ, సత్తిబా బు, మైసం వెంకటేశ్వర్లు, కలియాబాయి దశరథ్, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, సత్తార్, అహ్మ ద్, గఫార్ తదితరులు ఉన్నారు.
రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహ నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో.. అధికారులు ఏం చేస్తున్నారని పంచాయతీ రాజ్ ఏఈ కిరణ్కుమార్పై స్పీకర్ పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ఆగ్రహించారు. మూడు నెలల్లో పను లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం సిద్దాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. ఐకేపీ అధ్వర్యంలో కొనుగోలు చేసిన గడ్డి చుట్టే యంత్రాలను ఆయన ప్రారంభించారు. పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.