డిచ్పల్లి : టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నియోజకవర్గంలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామం, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ. 1960 , బిగ్రేడ్ రకానికి రూ. 1940లు చెల్లిస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అడ్డకులు పెట్టినా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, రామాలయం చైర్మన్ మహేందర్రెడ్డి, వైస్ చైర్మన్ కుమ్మరి చిన్నగంగారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతశ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు శక్కరికొండ కృష్ణ, ఉపాధ్యక్షులు రాథోడ్ సుదం, ప్రధాన కార్యదర్శి హరికిషన్, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, మోహన్రెడ్డి, పద్మారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.