నమస్తేతెలంగాణ యంంత్రాంగం, మార్చి3: జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఆర్డీవో రాజాగౌడ్, డిప్యూటీ డీఎంహెచ్వో విద్య, ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ప్రారంభించారు.