నందిపేట్, అక్టోబర్ 5 : ‘నాది అభివృద్ధి, సంక్షేమవాదం. ఆర్మూర్ నియోజకవర్గ డెవలప్మెంట్ నా సెంటిమెంట్. నా నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణదానికైనా సిద్ధం, సిద్ధుల గుట్ట శివయ్య సాక్షిగా చెబుతున్న జీవితాంతం మీకోసం జీతగాడిలా పని చేస్తానని‘ పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురంలో భా గంగా గురువారం నందిపేట్ మండలం బాద్గుణ గ్రామంలో ‘ప్రజాశీర్వాద యాత్ర’ నిర్వహించారు.
గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోకి వస్తున్న సమయంలో సురేశ్, చిన్నగంగారెడ్డి, శైలజ, ముత్యం, శంకర్, ఎర్రక్క తదితర వికలాంగులు తారసపడి ఎక్కడికి పోతున్నారు సార్ అని అడిగిండ్రు మీ ఊరికే పోయి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చెప్పి మూడోసారి కూడా నాకే ఓటేయమని అర్థించడానికి వెళుతున్నానని చెప్పారు.
‘ఎందుకు సార్ మీకనవసర శ్రమ కేసీఆర్ మా వికలాంగుల పట్ల దేవుడు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్య త మాపై’ ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసరా పింఛన్లు, రైతుబంధు, షాదీముబారక్, రైతుబీమా వంటి పథకాలతో ప్రతి ఒక్కరికి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నా రు. గృహలక్ష్మి ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షల చొప్పున మంజూరు చేయబోతున్నామని, బీసీ వర్గానికి చెందిన 15 కుల వృత్తుల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక చేయూతనందిస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతల కు అభివృద్ధి అంటే కండ్ల మంట, వాళ్లు ఓట్ల కోసం వచ్చే దసరా వేషగాళ్ల సంక్రాంతి గంగిరెద్దులు, కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ఓటేస్తే మిమ్మల్ని కాటేస్తాయన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని.. తాను హ్యాట్రిక్ సాధించి తీరుతానని జీవన్రెడ్డి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బాద్గుణలో నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణంలో నిత్యం తర్పీదు పొందేలా యువకులను ప్రోత్సహించేందుకు వారికి ఎమ్మెల్యే క్రికెట్ కిట్లు ఇచ్చారు.