కేజీవీల్ ట్రాక్టర్లను అజాగ్రత్తగా నడిపితే ప్రమాదమే
నైపుణ్యం, అవగాహన లోపంతో మరణాలు
కోటగిరి, జూలై 1 : పొలం దున్నేందుకు వెళ్లిన డ్రైవర్ ఇంటికి వస్తాడన్న భరోసా లేకుడా పోతోంది. వరినాట్ల కోసం పొలాల్లో దమ్ము కొట్టేందుకు కేజీవీల్ ట్రాక్టర్లతో వెళ్తున్న డ్రైవర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని డ్రైవర్లు.. ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కుటుంబాలకు కడుపుకోత మిగుల్చుతున్నారు. కేజీవీల్ ట్రాక్టర్లు బోల్తా పడి ఏటా మరణాలు సంభవిస్తున్నాయి. ముందు జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.
జిల్లాలో వానకాలం సీజన్ పొలం పనులు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నారు. సాగునీటి వసతి ఉన్నవారు పొలాల్లో దమ్ము కొట్టించి వరినాట్లు కూడా ప్రారంభించారు. సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కావడం, డ్రైవర్లకు నైపుణ్యం, అవగాహన, అనుభవం లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి సీజన్లో కేజ్వీల్ ట్రాక్టర్లు నడుపుతూ ఎక్కడో ఒకచోట డ్రైవర్లు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగు చూస్తుడడంతో వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
ముందు జాగ్రత్తలు పాటించాలి..
ప్రమాదాలకు కారణాలివే ..
నిబంధనలు పాటించాలి..
శక్కర్నగర్, జూలై 1: నిబంధనలు అతిక్రమించి కొంతమంది కేజ్వీల్ ట్రాక్టర్లను రోడ్లపై నడపడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ సొమ్ము వృథా అవుతున్నది. ప్రతి సీజన్లో కేజ్వీల్ ట్రాక్టర్లు రోడ్లపై నడుపొద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొంతమంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బోధన్ పట్టణ శివారుతోపాటు మండలంలోని పలు గ్రామీణ ప్రాంతాల రోడ్లపై నిబంధనలు అతిక్రమించి కొనసాగుతున్న కేజీవీల్ ట్రాక్టర్ల కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. బీటీ రోడ్లను వేసిన అధికారులు, కేజీవీల్ ట్రాక్టర్ల నియంత్రణ కోసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కేజీవీల్ ట్రాక్టర్లకు పట్టీలు వేయించకపోవడంతో రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయి. రోడ్ల సంరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల రోడ్ల పక్కన కేజీవీల్ ట్రాక్టర్లను రోడ్లపై నడుపొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీనికి తోడు వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సైతం కేజీవీల్స్కు పట్టీలు వేయించాలని యజమానులకు సూచిస్తున్నారు. అయితే పలువురు రైతులు ట్రాక్టర్లకు పట్టీలు వేయించగా, మరికొందరు పట్టీలు వేయకుండా అలాగే నడుపుతుండడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి.
తొందరపాటు వద్దు ..
మడుల్లో నీరు ఎక్కువగా ఉంచాలి. దీనిద్వారా పొలంలో ట్రాక్టర్ సులువుగా తిరుగుతుంది. తొందరగా దున్నాలనే ఉద్దేశంతో డ్రైవర్లు ట్రాక్టర్ను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. సరైన నైపుణ్యం లేకపోవడం కూడా ప్రమాదాలు జరగడానికి కారణమవుతోంది. కేజీవీల్స్కు సమానమైన వెయిట్ బిల్లలను బంపర్కు పెట్టుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు.
– లక్ష్మీకాంత్రెడ్డి, మండల వ్యవసాయాధికారి, కోటగిరి