మాక్లూర్, డిసెంబర్ 19 : ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన మాక్లూర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ ఇంటిని ముట్టడించేందుకు గ్రామస్తులు మంగళవారం యత్నించారు. సర్పంచ్ అశోక్రావును సైతం గ్రామస్తులు ఘెరావ్ చేశారు. నిందితుడికి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో అతడి ఇంటిని కూల్చివేసేందుకు యత్నించడంతో సమాచారం అందుకున్న నార్త్ రూరల్ సీఐ సతీష్, ఎస్సై సుధీర్రావు బలగాలతో వెళ్లి గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు.