ప్రజా సమస్యలు ఆలకించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి.. కొందరు అధికారులకు టైమ్పాస్ వ్యవహారంగా మారింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్లో కాలక్షేపానికి, ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం వేదికగా తయారైంది. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కొందరు జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది.
కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఫోన్లలోనే నిమగ్నమయ్యారు. ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేశారు. వేదికపై ఉన్న అధికారులు దరఖాస్తుల స్వీకరణలో నిమగ్నమైతే, కింద కూర్చున్న వారేమో ఇలా ‘ఆన్లైన్’లో విహరించారు. ఆయా దృశ్యాలను ‘నమస్తే’ క్లిక్మనిపించింది.