నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 30: ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 7 గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, ప్రత్యేక వాహనాల్లో దివ్యాంగులు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.