ప్రజాదర్బార్కు సిద్ధమైన టీఆర్ఎస్
అవినీతిపై చర్చించేందుకు మున్సిపాలిటీకి వచ్చిన నాయకులు
సమయానికి రాకుండా ముఖం చాటేసిన బీజేపీ నేత కాటిపల్లి
కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత
ప్రజాదర్బార్ను భగ్నం చేసిన పోలీసులు
కామారెడ్డి, మే 30 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మా టల యుద్ధం కొనసాగుతున్నది. అభివృద్ధి విషయంలో సోమవారం మున్సిపాలిటీ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సవాల్ విసురుకున్నారు. దీంతో సోమవారం ఉదయం నుంచి పోలీసు బలగాలు రావడం, మున్సిపాలిటీ వద్ద బారికేడ్లు ఏ ర్పాటు చేసి ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉండడంతో ఇరు పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రదర్శనలు నిర్వహించడంతో 60 మందిని 151 సెక్షన్ కింద అరెస్ట్ చేసి దేవునిపల్లి, మాచారెడ్డి, రాజంపేట, గాం ధారి, లింగంపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ను స్వీకరించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు పార్టీ కౌన్సిలర్లు, అనుచరులతో మున్సిపాలిటీకి తరలివచ్చారు. ఉదయం 10గంటలకు రావాలని బీజేపీ నేత విసిరిన సవాల్ను స్వీకరించి ముందుగానే మున్సిపాలిటీ వద్దకు వచ్చినప్పటికీ బీజేపీ నేతలు ముఖం చాటేశారు.
టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు వందలాది సంఖ్యలో మున్సిపాలిటీ వద్దకు రాగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కౌన్సిలర్ల అవినీతి, పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అవినీతిని నిరూపించేందుకు వచ్చామని, ప్రజాదర్బార్కు అవకాశం ఇవ్వాలనీ టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు పోలీసులను కోరారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున సభ లు, సమావేశాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మున్సిపాలిటీలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు టీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యకర్తలతో పోగు కావడంతో 30 యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజాదర్బార్కు అనుమతి లేదని కామారెడ్డి డీఎస్పీ సోమనాథం మైక్లో ప్రకటించారు.
మున్సిపల్ కార్యాలయం వరకు రాకుండా ముందుగానే అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నేతలు కామారెడ్డి పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేపట్టారు. కామారెడ్డి డీఎస్పీ సోమనాథం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవడంతో చివరికి వారిని అరెస్టు చేసి మాచారెడ్డి, రాజంపేట, గాంధారి, లింగంపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో బీజేపీ నాయకులు ఆందోళన చేసి ఉద్రిక్త పరిస్థితులకు కారణం కావడంతో జిల్లా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. బీజేపీ నాయకులు కొందరు పోలీసుల విధులకు విఘాతం కలిగించినందున చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
60మంది టీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్
కామారెడ్డి మున్సిపాల్టీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో 60 మంది టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ముందుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, కామారెడ్డి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్ కుమార్, చాట్ల రాజేశ్వర్, మిర్జా హఫీజ్ బేగ్, భాస్కర్ గౌడ్, చాట్ల వంశీ, ఇమ్రాన్, పట్టణ యూత్ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్, నాయకులు పిప్పిరి వెంకటి, శివారెడ్డిని అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరేశ్ తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ, పోలీస్స్టేషన్ వద్ద పరిస్థితులను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు
సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నాడు ..
బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డికి విసిరిన సవాల్కు తాను కట్టుబడి పార్టీ నేతలతో ప్రజాదర్బార్కు వస్తే అక్కడికి ఎందుకు సమాయానికి రాలేదని నిట్టు వేణుగోపాల్ రావు ప్రశ్నించారు. రమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు దాటవేసే ధోరణితో సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు. చెప్పిన మాటకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, బీజేపీ కౌన్సిలర్ల అవినీతిని తప్పకుండా బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. అడ్లూర్ శివారులో 501 సర్వే నంబర్లో దళితుల 10 ఎకరాల భూమిని కబ్జా చేసి తన కు టుంబ సభ్యుల పేరిట మార్పిడి చేయలేదా అని ప్ర శ్నించారు. అనవసర ఆరోపణలు చేసే ఆయన వెం టనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక నుంచి రమణారెడ్డి బాధితుల చిట్టాను ఒక్కొక్కటి విప్పుతామన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ముందుస్తు అరెస్టులు : డీఎస్పీ
జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలగనీయకుండా ఉండేందుకు ప్రజాదర్బార్కు అనుమతి లేదని ముందుగానే పత్రిక ప్రకటన ఇచ్చామని డీఎస్పీ సోమనాథం తెలిపారు. జిల్లా పరిధిలో ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు లేవన్నారు. మున్సిపాలిటీ వద్ద టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడం తో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండానే ఉం డేందుకు ముందస్తు అరెస్టులు చేశామన్నా రు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి చర్యలనూ పో లీస్ శాఖ సహించేది లేదన్నారు. మున్సిపాలిటీ వ ద్ద కామారెడ్డి అడిషనల్ ఎస్పీ అనోన్య ఆధ్వర్యంలో కామారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు సోమనాథం, జైపాల్ రెడ్డి భారీ బందోబస్తు నిర్వహించారు.