Special puja | వినాయక్ నగర్, సెప్టెంబర్ 6 : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో నెలకొల్పిన శ్రీ ఓం గణేష్ మండలి వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ అనంతరం పోలీస్ సిబ్బంది వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం తరలించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆదనపు డీసీపీ (అడ్మిన్) జీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్ తోపాటు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.