కమ్మర్పల్లి/ మోర్తాడ్, జనవరి10 : మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో హాసాకొత్తూర్ రోడ్డులోని బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం మధ్యాహ్నం కొందరు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఏర్గట్ల ఎస్సై రాజు, కమ్మర్పల్లి ఏఎస్సై ఇస్మాయిల్ చేరుకొని అక్కడన్న కోనాసముందర్కు చెందిన కొండా సతీశ్, కల్ల దేవరాజ్, కమ్మర్పల్లికి చెందిన మద్దెల ఈశ్వర్, లోలం గణేశ్, చిత్తారి వంశీలను పట్టుకున్నారు.
వీరి నుంచి 850 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసకున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు త్వరగా పరిష్కరించిన ఎస్సై రాజు, ఏఎస్సై ఇస్మాయిల్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు శేఖర్, సురేష్, విజయ్ని సి.ఐ. అభినందించారు. మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన బొబ్బిలి నవీన్, అష్రఫ్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు. వీరిని నుంచి 300 గ్రాముల గంజాయి, రెండుసెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు.