నస్రుల్లాబాద్, నవంబర్ 8 : రాజకీయంగా తనకు మొదటి నుంచి అండగా ఉంది బంజారాలేనని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని రాజేశ్తండా, హాజీపూర్, కట్టకింది తండా, ఎల్కచెట్టు తండా, సంగం, సంగం తండా, అంకోల్ తండా, అం కోల్, అంకోల్ క్యాంపు, అంకోల్ న్యూ క్యాంప్, కంశెట్ పల్లి, నాచుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టా రు. మహిళలు మంగళహారతులతో పోచారానికి స్వాగ తం పలికారు. నాచుపల్లిలో భారీ బైక్ ర్యాలీతో యు వకులు, గ్రామస్తులు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచార సభలో ఆయన మాట్లాడు తూ.. ఈ ప్రాంతంలో బంజారాల భూములు ఎక్కువ మెట్ట ప్రాంతాల్లో ఉన్నాయి. తాను మొదటి సారి శాస న సభ్యుడిగా అయినప్పటి నుంచి బంజారాల మీద ప్రేమతో వ్యవసాయం చేయడానికి అవసరమైన సహ కారాన్ని అందించానన్నారు. అంకోల్ క్యాంపు నుంచి హాజీపూర్ గ్రామం వరకు రూ.12 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి బంజారాలకు స్వయం పరిపాలన అందించిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 2100 మంది గిరిజను లకు 4000 ఎకరాల పోడు పట్టాలను అందించామ న్నారు. మిగిలిన పోడు భూముల రైతులకు కూడా పట్టాలు అందుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కోట్లాది రూపా యలతో అభివృద్ధి పనులను చేయించానని తెలిపారు. గ్రామాల్లో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయించానని చెప్పారు. కుల సంఘాలకు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశానన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పథకాలు అమ లు చేయకుండా ఇక్కడ మాత్రం ఇస్తామని అబద్దాలు ఎలా చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఎంపీపీ విఠల్, బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీటీ సీ సభ్యురాలు జున్నూబాయి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, సర్పంచులు అంజయ్య, బద్యా, లక్ష్మి, సాయి లు, రాము, విజయ, విండో చైర్మన్లు సుధీర్, శ్రీనివాస్, గంగారాం, మారుతి నాయకులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్/కోటగిరి/బాన్సువాడ టౌన్/వర్ని /బాన్సువాడ, నవంబర్ 8 : బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని ఇబ్రహీంపేట్, తాడ్కోల్, బోర్లం, కొల్లూరు, హన్మాజీపేట్, కొయ్యగుట్ట, బోర్లం క్యాంపు, తిర్మలాపూర్, దేశాయిపేట్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బుడ్మి సొసైటీ మాజీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, నాయకులు నారాయణరెడ్డి, ప్రవీణ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ, భూనేకర్ ప్రకాశ్, సాయి లు యాదవ్, బండి పండరి, శ్రీనివాసరెడ్డి, దేవేందర్రెడ్డి, మన్నెచిన్న సాయిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటగిరిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో అనిల్ కులకర్ణి, కూసిద్దూ, హౌగిరావుపటేల్, బర్ల మధు తదితరులు ఉన్నారు. బాన్సువాడ పట్టణం వినాయకనగర్లో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ దొన్కంటి వెంకటేశ్, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వర్ని మండలంలోని పాత వర్ని, సత్యనారాయణపురం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, వంకా నగేశ్, పెనుమర్తి శ్రీహరి, పాత వర్ని గ్రామంలో సంతోష్ కులకర్ణి, ఎంబడి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలో పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ రమాదేవి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు అనిత, అనిల్, ముదిరెడ్డి విఠల్రెడ్డి, జలపతిరెడ్డి, పుండరి మేస్త్రీ, సంతోష్రెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు.