బాన్సువాడ, ఫిబ్రవరి 23: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంపై మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.