నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 8 : ఆలయాల నిర్మాణానికి స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సాయిబాబా ఆలయానికి ప్రభుత్వం నుంచి రూ.50లక్షలను ఆయన మంజూరు చేయించారు.
హైదరాబాద్లో స్థానిక ప్రజాప్రతినిధులకు, వీడీసీ, ఆలయ కమిటీ సభ్యులకు ఉత్తర్వు కాపీలను బుధవారం అందజేశారు. సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ నవీన్, వీడీసీ, ఆలయ కమిటీ సభ్యులు బాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపి శాలువా కప్పి సత్కరించారు. తిర్మన్పల్లి గ్రామస్తులు, గ్రామాభివృద్ధి, ఆలయ కమిటీ సభ్యులు రూ.10 లక్షలు సమకూర్చుకోగా.. ప్రభుత్వం మరో రూ.40 లక్షలు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రూ.50లక్షలతో సాయిబాబా ఆలయం నిర్మాణం చేపట్టనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.