వినాయక్నగర్, అక్టోబర్ 12: దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పకుండా సంబంధిత డివిజన్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలను ఏర్పాటు చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.