కంఠేశ్వర్, ఫిబ్రవరి 19 : ఓటరు జా బితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్లకు సూచించారు. జాబితాలో మార్పులు -చేర్పులు, పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా అందజేయాలని ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు నిర్దిష్ట గడువులోగా గుర్తింపు కార్డులు చేరేలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఓటరు ఐడీని హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చనే విషయంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమ్యసాత్మక పోలింగ్ కేంద్రాలను జాగ్రత్తగా గుర్తించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు చేపడుతున్న చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు తమకు నివేదికలు పంపించాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమంతప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జాబితాను పక్కాగా పరిశీలించాలి:
ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పరిశీలించాలని అధికారులను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు.వీసీ అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2024 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారి నుంచి సైతం దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. మృతి చెందిన ఓ టర్ల పేర్ల తొలగింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, కమిషనర్ ఎం.మకరంద్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి సురేశ్కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, వినోద్కుమార్, భుజంగ్రావు, సహాయ ఈఆర్వోలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్, సాత్విక్, సంతోష్ పాల్గొన్నారు.