శక్కర్నగర్, మే 19: ప్రజా పంపిణీలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నది. రూ.లక్షల విలువ చేసే వందల క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు. తాజా గా మంగళవారం సాయంత్రం బోధన్ పట్టణ శివారు శ్రీనివాస నగర్ ప్రాంతంలోని సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లుపై సీఐ వెంక ట నారాయణ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.
రైస్మిల్లులో బియ్యం బస్తాలు ఉన్న డీసీఎం వ్యాన్లను గుర్తించారు. విజిలెన్స్ డీటీ హనుమాన్తో పంచనామా చేయించి 275 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా ఉంచినట్లు నిర్ధారించారు. సీజ్ చేసిన బియ్యం విలువ సుమారు రూ.8.26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డీటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బియ్యాన్ని, డీసీఎంలను సీజ్ చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు.