భిక్కనూరు, మే 20 : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని డీపీవో శ్రీనివాస్ అన్నారు. భిక్క నూరులోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామా ల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. తడి పొడి చెత్తతో ఎరువులు తయారు చేసి పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎల్పీవో సాయిబాబా, ఎంపీడీ వో అనంత్రావు, ఎంపీవో ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సదాశివ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, డ్రైనేజీల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి అన్నారు.
పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా బాన్సువాడ మండలం కొల్లూరు, దేశాయిపేట్ తదితర గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. స్థానిక సర్పంచులు, కార్యదర్శులతో కలిసి గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో పరిశుభ్రతపై దృష్టి సారించాలని కార్యదర్శులకు సూచించారు. సర్పంచులు తుకారాం, శ్రావణ్కుమార్, ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శులు సృజన్రెడ్డి, రవి, ఉప సర్పంచ్ సాయిలు, బీఆర్ఎస్ నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, వడ్ల సంతోష్ తదితరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి, లింగంపల్లి, మైలారం తదితర గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ఎంపీవో రాము పరిశీలించారు. డ్రైనేజీలు శుభ్రం చేయడంతోపాటు రోడ్లపై చెత్తా చెదారాన్ని తొలగించాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. బీబీపేట్ మండలం జనగామ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.