మాక్లూర్, జనవరి 21: మండలంలోని రామచంద్రాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రూ.25లక్షల నిధులతో భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, ఎంపీడీవో జైక్రాంతి, సర్పంచ్ కట్కం వెంకన్న, ఎంపీటీసీ పెద్దులు తదితరులు పాల్గొన్నారు.