కామారెడ్డి/ ఖలీల్వాడి, ఏప్రిల్ 19: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బుధవారం 1063 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో 4,947 మందికి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ తెలిపారు. వారిలో 502 మందికి కళ్లద్దాలు పంపణీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3,16,267 మందికి పరీక్షలు నిర్వహించి 47,829 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని వివరించారు.
నిజామాబాద్ జిల్లాలో 9,116 మందికి నేత్ర పరీక్షలు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుదర్శనం తెలిపారు. వారిలో 806 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4,54,810 మందికి పరీక్షలు నిర్వహించి 79,868 మందికి అద్దాలు అందజేశామని చెప్పారు.