మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1500 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
ఈ సీజనులో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్ లోకి 532.786 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) సామర్థ్యం కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు( 89.763 టీఎంసీల) నీటి నిల్వ ఉందని ఆయన వివరించారు.