డిచ్పల్లి, ఏప్రిల్ 18: టీయూ పరిధిలోని 2011 నుంచి 2016 వరకు డిగ్రీ (వైడబ్ల్యూఎస్) అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వన్టైం ఛాన్స్ ఇస్తున్నట్లు నియంత్రణాధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ(ఎల్) కోర్సులకు 1వ, 2వ, 3వ సంవత్సరపు బ్యాక్లాగ్ పరీక్షలు జూన్, జూలైలో జరుగుతాయని, పరీక్ష ఫీజును మే 2 వరకు, రూ.100 అపరాధ రుసుముతో మే 3వరకు చెల్లించాలని పేర్కొన్నారు.
2016 నుంచి 2019 వరకు డిగ్రీ (సీబీసీఎస్) బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ సెమిస్టర్, బ్యాక్లాగ్ పరీక్షలకు వన్టైమ్ ఛాన్స్ ఇచ్చామని, పరీక్ష ఫీజును మే 2 వరకు చెల్లించవచ్చని, అపరాధ రుసుముతో మే 3న చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని పరీక్షల సూచించారు.