నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 29: జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. 45 ఏండ్లు దాటిన వారికి కొవిడ్ టీకాలను వైద్య సిబ్బంది వేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మోస్రా పీహెచ్సీలో 40 మందికి టెస్టులు నిర్వహించగా 16 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారిణి స్వప్న తెలిపారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో 58మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 17మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 79 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. మండలంలోని పొతంగల్ పీహెచ్సీలో 45 మందికి కరోనా పరీక్షలు చేయగా 10 మందికి, కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 34 మందికి టెస్టు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని కోటగిరి దవాఖాన డాక్టర్ సమత తెలిపారు. కోటగిరి దవాఖానలో 73 మందికి, పొతంగల్లో 48 మందికి టీకా వేసినట్లు వివరించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీ పరిధిలో 37మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ దిలీప్ తెలిపారు. మొదటిడోస్ వ్యాక్సిన్ 63మందికి, రెండవ డోస్ 8మందికి వేశామన్నారు.సిరికొండ మండల కేంద్రంలో 45 మందికి టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి మోహన్ తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 176 మందికి కొవిడ్ వ్యాక్సిన్ చేసినట్లు మండల ప్రధాన వైద్యాధికారి రఘువీర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 56 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో 22మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వివరించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. 70 మందికి కొవిడ్ టీకాలు వేశామన్నారు. మోపాల్ మండలంలో గురువారం 111 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. 40 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు.
బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 106 మందికి పరీక్షలు నిర్వహించగా 39 మందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 36 మందికి పరీక్షలు నిర్వహించగా 15 మందికి, పాన్గల్లీలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా తేలిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఎడపల్లి పీహెచ్సీలో 60 మందికి పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. నందిపేట్ పీహెచ్సీలో 239 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి అజయ్ గురువారం తెలిపారు. 46 మందికి పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా తేలిందన్నారు. భీమ్గల్ పీహెచ్సీలో గురువారం 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యు డు అజయ్పవార్ తెలిపారు. 114 మంది టీకా తీసుకున్నారని చెప్పారు. మోర్తాడ్ పీహెచ్సీలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, 135 మందికి కొవిడ్ టీకా వేశామని డాక్టర్ సుమంత్ తెలిపారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మండల వైద్యాధికారిణి తోపా టు ఏఎన్ఎంలు, సిబ్బంది కలిసి మొత్తం 10 మందికి కరోనా సోకడంతో 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉంటారు.
రెంజల్ పీహెచ్సీలో ఈనెల 19న ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా టెస్టులు నిర్వహించగా, 11 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆర్మూర్ మున్సిపల్లోని ఏరియా దవాఖానలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు తెలిపారు. పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికి టెస్టులు నిర్వహించగా పది మందికి, దేగాం పీహెచ్సీలో 41 మందికిగాను 21 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. మొత్తం 604 మందికి టీకాలు వేశామని చెప్పారు. మాక్లూర్, కల్లెడి పీహెచ్సీల పరిధిలో 32 మంది కరోనా బారిన పడినట్లు వైద్యాధికా రులు తెలిపారు.