నిజామాబాద్: కొన్నిరోజుల క్రితం నిజాబామాద్లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ దొరికింది. స్థానికంగా ఉన్న షాపింగ్మాల్లో ఉండగా శుక్రవారం నాడు ఆ చిన్నారిని కొందరు దుండగులు అపహరించారు. ఆపై మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ మిస్టరీని ఛేదించారు. పాపను నిజామాబాద్ తీసుకొస్తున్నారు.