హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో 85,453 మంది ప్రవేశాలు పొందారని ఇంటర్విద్యాశాఖ వెల్లడించింది. నిరుడు 75వేల మంది చేరగా, ఈ ఏడాది 14% అడ్మిషన్లు పెరిగినట్టు ప్రకటనలో తెలిపింది.
సోమవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో ప్రిన్సిపాళ్లు, డీఐఈవోలకు ఒక రోజు ఓరియంటేషన్ నిర్వహించింది. సమగ్రశిక్షా నిధుల వినియోగం, స్పర్శ్ పోర్టల్ ద్వారా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, పోష్ చట్టం అమలుపై అవగాహన కల్పించింది.