నిజామాబాద్ : జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడింది. వారం రోజులుగా మేఘావృతమైన వాతావరణ పరిస్థితుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీనికి తోడుగా వర్షం కురుస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతున్నది. కాగా ఈ వర్షంతో కొంతమేర పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అలాగే పలు చోట్ల చెట్లు రోడ్లపై విరిగిపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.