నందిపేట్, డిసెంబర్ 20 : మండలంలోని బజార్కొత్తూర్ గ్రామంలో ఉద్యానవన, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డీడీఏ నర్సింగ్దాస్ మాట్లాడుతూ.. ఆయిల్పామ్ మొక్క కేవలం రూ.20లకే అందజేయనున్నట్లు తెలిపారు. ఎకరానికి 50 మొక్కలు నాటుకోవచ్చని, వెయ్యి రూపాయల డీడీ తమ శాఖ పేరిట తీసి అందజేస్తే ఎకరానికి 50 మొక్కలు ఇస్తామన్నారు. ఎకరానికి కేవలం రూ. 10 వేల నుంచి రూ.15 వేల పెట్టుబడి పెడితే 10 టన్నుల ఆయిల్పామ్ దిగుబడి వస్తుందని, దీంతో రూ. లక్ష ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రాయితీలను రైతులకు వివరించారు. మంచి లాభదాయకంగా ఉన్న ఆయిల్పామ్ సాగుపై రైతులు మొగ్గు చూపాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారిణి జ్యోత్స్నభవానీ, ఉద్యానవన శాఖ అధికారి రోహిత్, ఏఈవోలు పాల్గొన్నారు.