డిచ్పల్లి/ సిరికొండ, డిసెంబర్ 18 : పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన ఎం.మల్లేశ్కు రూ.3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. లబ్ధిదారులకు చెక్కును ఆర్టీసీ చైర్మన్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్తో కలిసి అందజేశారు. ఎనిమిది మందికి రూ.5,43,600 విలువ చేసే చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగీతా రాజేందర్, జడ్పీటీసీ మాన్సింగ్నాయక్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లింగేశ్వర గుట్ట ఆశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వర గుట్ట ఆశ్రమాన్ని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఆశ్రమ ఆవరణలోని శివాలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యే బాజిరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఆశ్రమానికి వెళ్లే మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చేందుకు, గుట్ట పైభాగం నుంచి వరదనీరు రావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఆశ్రమానికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్న నేపథ్యంలో మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, నాయకులు బానోత్ ప్రేమ్దాస్నాయక్, బొల్లెంక గోపాల్రెడ్డి, సొసైటీ చైర్మన్లు పైసా స్వామి, దాసరి శ్రీధర్, సర్పంచులు నగేశ్, అశోక్, గోపాల్నాయక్ తదితరులు ఉన్నారు.