నవీపేట, డిసెంబర్ 14: బోధన్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మహ్మద్ షకీల్ ఆమేర్పై బీజేపీ నేత వి.మోహాన్రెడ్డి అసతస్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వినర్సింగ్రావు, ఎంపీపీ సంగెం శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు మంత్రి సాయికుమార్గౌడ్, మైనార్టీ నాయకుడు ఉమర్ విలేకరులతో మాట్లాడారు. తన సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కొంత కాలంగా పార్టీలో కొనసాగిన మోహన్రెడ్డి ఇటీవల బీజేపీలో చేరి ఎమ్మెల్యే షకీల్పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని మండి పడ్డారు. వైకరిలో మార్పు రాకుంటే అక్రమాలను బయటికి తీస్తామని హెచ్చరించారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కరోనా సమయంలో రూ.5 కోట్లతో పేదలను ఆదుకున్నాడని కొనియాడారు. సమావేశంలో నవీపేట సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్కుమార్, బినోలా వైస్ చైర్మన్ బాబర్, పార్టీ నాయకులు నీరడి బుచ్చన్న, అల్లం రమేశ్, గైని సతీశ్, అలీం, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.