ముప్కాల్, డిసెంబర్ 14: మండల కేంద్రంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగుతున్న (అండర్-16 సబ్ జూనియర్ బాలబాలికల) కబడ్డీ శిక్షణ శిబిరం బుధవారం ముగిసినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కే.గంగాధర్ తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ బద్దం నర్సవ్వా నర్సారెడ్డి మాడ్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అంద్యాల లింగయ్య పర్యవేక్షణలో ఎంపిక చేసినట్లు తెలిపారు. బాలురు 16, బాలికలు 16 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో నిర్వహించనున్న 32వ అంతర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందాల లింగయ్య, పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు.