నందిపేట్, డిసెంబర్ 13 : అన్ని వర్గాల అభ్యున్నతే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని కౌల్పూర్ పంచాయతీ పరిధిలోని రైతుఫారం గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామం మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించి దూరంగా ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరగా, వెంటనే విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని ఆదేశించారు. గ్రామంలోని పలు సమస్యల పరిష్కారంతోపాటు అంగన్వాడీ భవన నిర్మాణం, పేదలకు స్థలాలు, ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవేందర్, కౌల్పూర్ సర్పంచ్ గబ్బర్, మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు ధన శ్రీను, మచ్చర్ల గంగారాం, దారం సురేశ్, రాములు పాల్గొన్నారు.
కమ్మ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ
మాక్లూర్, డిసెంబర్ 13 : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కమ్మ సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సామాజికవర్గాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కుల సంఘ భవనాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. గుంజలి గ్రామంలో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి రూ. 25 లక్షల చెక్కులను అందజేయగా, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ మాస్త ప్రభాకర్, సర్పంచ్ వేములపల్లి సుబ్బారావు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, శివరామయ్య, రంజిత్, గుంజిలి సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.