బాల్కొండ/భీమ్గల్, నవంబర్ 29 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. జలాల్పూర్ నుంచి నాగేపూర్ ఎక్స్ రోడ్డు వరకు రూ. 60 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు, నూతనంగా మంజూరైన ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భీమ్గల్-గోన్గొప్పుల రహదారి బోగరపు వాగుపై రూ.2.60 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ప్రారంభించారు. భీమ్గల్-బెజ్జొరా రహదారి జక్కలత్ ఒర్రెపై రూ.2.35 కోట్లతో నూతనంగా నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. భీమ్గల్, కమ్మర్పల్లి రహదారిపై మెండో రా వద్ద రూ.1.66 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు.
ప్రతిచోట ప్రజలు డ ప్పు వాయిద్యాలు, బోనాలు, మంగళహారతులతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ పల్లెల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగిస్తుందన్నారు. వానకాలంలో కురిసిన ఏకధాటి వర్షాలతో లోలెవల్ కాజ్ వేలు దెబ్బ తిని రవాణాపరంగా ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో భీమ్గల్ మండలానికి మూడు హైలెవల్ వంతెనలు మంజూ రు చేశారని తెలిపారు. వీటిలో ఇప్పటికే గోన్గొప్పుల, మెండోరా వద్ద రెండు వంతెనలు పూర్తయ్యాయని, బెజ్జోరా వద్ద రూ. 2.35 కోట్లతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.
వచ్చే మూడు మాసాల్లో పనులు పూర్తి చేయిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, ప్రభుత్వ అభివృద్ధిపై ఆలోచనలు చే యాలని కోరారు. గతంలో రూ.200 లకే పరిమితమైన ఆసరా పెన్షన్లను రూ.రెండు వేలకు పెంచామని, దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ను నెలనెలా అందిస్తున్నామని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఎలాం టి పైరవీలకు ఆస్కారం లేకుండా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక తోడ్పాటును సమకూరుస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాల్కొండలో ఓ చిన్నారిని ఆప్యాయంగా ముద్దాడి డబ్బులు అందజేశారు.
బీజేపీ, ఎంపీ అరవింద్ తీరుపై మంత్రి ఫైర్
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకరావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అనునిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నార ని మంత్రి ప్రశాంత్రెడ్డి దుయ్యబట్టారు. ద మ్ముం టే తమతో సమానంగా అభివృద్ధిలో పోటీ ప డా లని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి మొనగాడివని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ అరవింద్కు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ నిధులన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ర్టాలకు తరలిపోతున్నాయని, బీజేపీకి చెందిన ఈ ప్రాంత ఎంపీ మాత్రం నిధులు తేలేక చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుల అబద్ధాలను నమ్మి ఆగమైతే, అభివృద్ధిని చేజేతులా దూరం చేసుకున్న వారవుతారని ప్రజలకు హితవు పలికారు. పచ్చగా ఉన్న పల్లెల్లో కుల, మతాల పేర్లతో చిచ్చు పెట్టి ఆగం చేస్తున్న నాయకులు ఎవరో నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న వారెవరో ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి ప్రశాంత్రెడ్డి కోరారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మొయీజ్, ఎంపీపీ లావ ణ్యా లింగాగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్, ఓఎస్డీ విజయేందర్రెడ్డి, ఏసీపీ ప్రభాకర్, సీఐ గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో సంతోష్కుమార్ పాల్గొన్నారు.
భీమ్గల్లో ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, ము న్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, ఎంపీపీ మహేశ్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, భీమ్గల్ సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ భగత్, పార్టీ మండల అధ్యక్షుడు నర్స య్య, పట్టణ అధ్యక్షుడు లక్ష్మ ణ్, రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు శర్మనాయక్, జిల్లా సభ్యులు కన్నె సురేందర్, కౌన్సిలర్లు లింగయ్య, మూత లతా నర్సయ్య గంగాధర్, తు మ్మ భూదేవి, మల్లెల అనుపమా ప్రసాద్, సతీశ్గౌడ్, సర్పంచులు రాగి అనసూయ, నర్సయ్య, రా జేందర్, ఎంపీటీసీలు ప్రేమలత, రవీందర్, గోన్గొప్పుల రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు భూమేశ్వర్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.