బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 29 : ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్నదాత అప్పుతెచ్చుకోకుండా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పీహెచ్సీ ఆవరణలో వైద్యుల కోసం రూ. 20లక్షలతో నిర్మించిన క్వార్టర్స్, రూ. 16లక్షలతో నిర్మించిన సహకార సంఘ వ్యాపార సముదాయ భవనం, రూ. 20లక్షలతో నిర్మించిన విండో కార్యాలయ భవనం, రూ.50లక్షలతో నిర్మించిన గ్రావెల్ రోడ్డు, రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం రూ. 10లక్షలతో చేపట్టనున్న బీడీ వర్కర్ల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ చీరెలు, ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి వ్యవసాయాన్ని పండుగగా మా రుస్తున్నారని అన్నారు.
గట్టు మీది గ్రామాలను సస్యశ్యామలం చేస్తాం
నిజాంసాగర్ ఆయకట్టు కింద జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని, గట్టు మీది గ్రామాలైన హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, కాద్లాపూర్ తదితర గ్రామాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిద్దాపూ ర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరందిస్తామన్నారు. పనులను వేగవతం చేసి, 40వేల ఎకరాల కు సాగు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు. సిద్దాపూర్ నుంచి మొండి సడాక్ వరకు ఇరువైపులా 20 కిలోమీటర్ల కాలువలను తవ్విస్తామన్నా రు.
కేంద్రం మొండి వైఖరితో రైతులకు ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల మొండి వైఖరిని అవలంబిస్తోందన్నారు. వారు పండించిన పంటను కొనేందుకు వెనకడుగు వేస్తున్నదని విమర్శించారు. యాసంగిలో రైతులు పండించిన ధా న్యాన్ని కోనాలని సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా.. మోదీ ప్రభుత్వం పటించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టపడి పండించిన ధాన్యం దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోకూడదని గ్రహించిన సీఎం కేసీఆర్ వారికి అండగా ఉంటూ పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రో జుల్లోనే డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.
సొంతింటి కలను సాకారం చేస్తాం..
గూడు లేని ప్రతి కుటుంబానికీ గూడు కల్పించడమే లక్ష్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 10వేల డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశానని తెలిపారు. అర్హులైన ప్రతిపేదవాడికి ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కలను సాకారం చేస్తానని భరోసా ఇచ్చారు. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునే వారికి దసరా పండు గ తర్వాత రూ. 3లక్షలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, సర్పంచ్ భోనా సుభాష్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బోర్లం విండో చైర్మన్ సంగ్రాం నాయక్, బుడ్మి, బాన్సువాడ సొసైటీ చైర్మన్లు పిట్ల శ్రీధర్, ఎర్వాల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఎంపీటీసీలు సుధాకర్రెడ్డి, జెట్టి హన్మాండ్లు, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్రెడ్డి, సామేందర్,శంకర్ గౌడ్, బాల్సింగ్, సాయిలు, సాయిబాబా, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.