బీర్కూర్, ఆగస్టు 11: దేశంలోని ప్రతి పౌరుడు అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు దేశం కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడ పట్టణంలో గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నా రు.
నేటి తరం పిల్లలకు స్వాతంత్య్ర అంటే ఏ మిటనే విషయంపై అవగాహన ఉండాలన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలని, దేశంలో ఉన్న పేదరికం అంతరించిపోవాలని, అందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అనంతరం పట్టణంలోని మహేశ్వరి థియేటర్లో విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను స్పీకర్ తిలకించారు. ఎంపీపీ దొడ్ల నీరజ, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జైపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ రమేశ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వర్నిలో నిర్వహించిన ఫ్రీడమ్న్ల్రో స్పీకర్ పోచారం పాల్గొన్నారు.