భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చౌట్పల్లి రవి మాట్లాడుతూ.. జీఎస్టీతో సామాన్యుడు బలయ్యాడని అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మనాయక్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ముప్కాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు ముస్కు భూమేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకుల తో కలిసి గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మావెంకట్రెడ్డి, జడ్పీటీసీ బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మునీరుద్దీన్, ప్రధాన కార్యదర్శి ఉమా శంకర్, టౌన్ అధ్యక్షుడు గంగాధర్, రెంజర్ల వెంపల్లి సొసైటీ చైర్మన్లు కోమటిరెడ్డి గంగాధర్, జక్క రాజేశ్వర్, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. పేదలపై మోదీ ప్రభుత్వం పన్నులతో విరుచుకు పడుతున్న తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, నాయకులు పండిత్ ప్రేమ్, పోల సుధాకర్, జనార్దన్గౌడ్, పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, సుంకరి రవి, రాము, కౌన్సిలర్లు సుంకరి రంగన్న, బండారి ప్రసాద్, మురళీధర్రెడ్డి, ఎస్ఆర్.రమేశ్, రింగుల భూష ణ్, శివప్రసాద్, తలారి చందు, పార్టీ యూత్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, రాజాబాబు, వినోద్, హన్మంతు, భూమన్న, రోహిత్, శ్రావణ్, లతీఫ్, నాగరాజు, చరణ్, రాజారెడ్డి, సుభాష్గౌడ్, నరేశ్, రైతులు పాల్గొన్నారు. రుద్రూర్లో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ గంగారాం, ఎంపీపీ సుజాత, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోస్రాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. రెంజల్ మం డలం సాటాపూర్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాం గ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు.