భీమ్గల్, జూలై 14: వర్షాలకు దెబ్బతిన్న రహదారి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. భీమ్గల్ పట్టణంలో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెరువులను మంత్రి గురువారం పరిశీలించారు. భీమ్గల్ నుంచి వేల్పూర్కు వెళ్లే రోడ్డు ధ్వంసమవగా పరిశీలించారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదలతో తెగినపోయిన మొగిలి చెరువును పరిశీలించారు. మంత్రి వెంట ఆర్టీవో శ్రీనివాసులు, డీసీవో సింహాచలం, ఆర్అండ్బీ ఈఈ భానుప్రకాశ్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, వైస్ చైర్మన్ భగత్ తదితరులు ఉన్నారు.
పచ్చలనడ్కుడలో చెక్డ్యామ్, పంటల పరిశీలన
వేల్పూర్, జూలై 14: మండలంలోని పచ్చలనడ్కుడ పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం పరిశీలించారు. కురుస్తున్న వర్షాలకు పెద్దవాగులో భారీగా వరద చేరడంతో చెక్డ్యామ్ వద్ద కోతకు గురైన కట్టతోపాటు పంట పొలాలను పరిశీలించారు. ఎంత మేరకు నష్టం జరిగిందని స్థానికులను అడిగి తెలసుకున్నారు. బాధితులకు మంత్రి భరోసా కల్పించారు. మంత్రి వెంటన సర్పంచ్ ఏనుగు శ్వేత, ఉప సర్పంచ్ గంగారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రాజన్న, ఎంపీటీసీలు గంగారెడ్డి, భూమన్న, టీఆర్ఎస్ నాయకులు నల్ల రమేశ్ తదితరులు ఉన్నారు.