వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. అన్నదాత ఎక్కడ పొలం దున్నితే అక్కడు పక్షులు వాలి కడుపు నింపుకొంటున్నాయి. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. దున్నే సమయంలో మట్టిలో ఉండే పేడ పురుగులు, ఇతర వ్యర్థాలు బయటపడుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో కొంగలు గుంపులుగా వచ్చి వీటిని ఆరగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం శాంతినగర్లో ఒకవైపు సాగు పనులు కొనసాగుతుండగా.. మరో వైపు ఆహారం కోసం వచ్చిన పంటలకు మిత్రులైన పక్షులు ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కాయి.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్