బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డును ఎందుకు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీ పార్టీకి చెందిన నాయకుడు నిజామాబాద్ ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేశాడు.. అవునా కాదా అని ప్రశ్నించారు.
మంత్రి వేముల ప్రధానికి వేసిన ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మంత్రి వేముల ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలని రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.