భీమ్గల్/ వేల్పూర్, జూన్ 17 : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు వేల్పూర్లోని వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. 9.30 గంటలకు వేల్పూర్ పీహెచ్సీని పరిశీలిస్తారు.
10 గంటలకు మోతె బైపాస్రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 60 లక్షలతో మోతె, పచ్చలనడ్కుడలో చేపట్టనున్న సీసీ రోడ్లనిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు మోతెలో రూ. 13 కోట్లతో పీహెచ్సీని ప్రారంభిస్తారు. అనంతరం పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. 11.30 గంటలకు భీమ్గల్లో నిర్మించనున్న వంద పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు. అనంతరం పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మోర్తాడ్ మండలకేంద్రంలోని సీహెచ్సీ, ఆక్సిజన్ప్లాంట్ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన పరిశీలనతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. వృద్ధుల కోసం రూ.50 లక్షలతో నిర్మించిన బిల్డింగ్, స్కిల్ సెంటర్తో పాటు 50 బెడ్ల ఐసీయూ యూనిట్ను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.