ధర్పల్లి, ఏప్రిల్ 1 : కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే అహర్నిశలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే సీఎం కేసీఆర్పై విమర్శలు మాని కేంద్రంపై పోరుకు తరలిరావాలని జిల్లా ఆర్థిక, ప్రణాళిక సంఘం స భ్యుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నా రు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మా ట్లాడారు. రైతుల కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కర్ణుడు కాదు. అర్జునుడు అని అన్నారు. రైతుల కోసం నిజంగా పాటు పడుతున్నది టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వరిధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై తలపెట్టిన పోరుకు తరలిరావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో రైతు సంక్షేమ పథకాల్లో వీరు వారు అనే తేడా లేకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు లబ్ధి పొందుతున్నారని దీన్ని గ్రహించాలని హితవు పలికారు. విశ్వాసం లేని కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమని స్తున్నారని, రైతుల కోసం పాటుపడుతుందో ఎవరో ప్రజలకు తెలుసన్నారు.పంజాబ్లో వరిధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం మన రాష్ట్రం రైతుల నుంచి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నందుకే కేంద్రం రైతులపై కక్షగట్టిందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ మాట లు చూస్తే తెలంగాణపై పగ పట్టినట్లు స్పష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏదో నిరసనలు చేస్తున్నామనే విధంగా కాకుండా రైతులపై నిజమైన ప్రేమ ఉంటే ఉగాది తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతు ల కోసం చేపట్టే ధర్నాలు, ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. తమతో పాటు కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కి రైతుల కోసం ధర్నా నిర్వహించిన నాడే ప్రజలు హర్షి స్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 8 గంటల విద్యుత్ సరఫరా మాత్రమే ఉండేదని ప్రస్తుతం 24 గంటలపాటు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తుందన్నారు. రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలతో రాష్ట్రంలోని రైతులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారన్నారు. రైతుల కోసం ఉద్యమి స్తున్న పోరాటంలో మద్దతిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.