ధర్పల్లి, ఫిబ్రవరి 25 : నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీస్తున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిసాగుచేస్తున్న రైతులు సంతోషం వ్యక్తంచేశారు.
భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో బోరుబావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల వర్షసూచన ఉండడంతో రైతులు వరణుడికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.