నిజాంసాగర్, జనవరి 5: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 2024-25 విద్యా సంవత్సరానికి నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 522 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారికి ఈనెల 20న ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ navodaya.gov.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్టికెట్ల డౌన్లోడ్లో ఏమైనా సమస్యలు ఉంటే నవోదయ పాఠశాలలో సంప్రదించాలని ఆమె కోరారు.