కోటగిరి/ ధర్పల్లి/ సిరికొండ/ డిచ్పల్లి/ బోధన్/ ఆర్మూర్/ బాల్కొండ/భీమ్గల్/మోర్తాడ్/మాక్లూర్, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం, ఓటు హక్కుపై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు.
కోటగిరి, పొతంగల్ మండలాల్లో తహసీల్దార్లు శ్రీకాంత్రావు, రమేశ్ ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కోటగిరిలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో, కోటగిరి జీపీ కార్యాలయ ఆవరణలో అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు.
ధర్పల్లి మండలకేంద్రంలో అధికారులు గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్ వద్ద ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. సిరికొండ తహసీల్ కార్యాలయంలో, సత్యశోధక్ పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. తహసీల్దార్ గఫూర్మియా సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఉపాధ్యాయులు ఓటుహక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
డిచ్పల్లిలోని టీయూ కంప్యూటర్ సైన్స్ భవనంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2,3,4 ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రొఫెసర్ రవీందర్ హాజరై మాట్లాడారు. ప్రిన్సిపాల్ ఆరతి, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రవీందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మహేందర్, డాక్టర్ స్వప్న పాల్గొన్నారు.జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఎంపీడీవో లక్ష్మణ్ ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఎంపీపీ కుంచాల విమలారాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, సర్పంచ్ మాధవీలతా దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండల కేంద్రంలో అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బోధన్లో ఆర్డీవో రాజేశ్వర్ మాట్లాడారు. తహసీల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, సిబ్బందిపాల్గొన్నారు. ఆర్మూర్లో ర్యాలీ నిర్వహించారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్ చైర్మన్ మున్నూబాయ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ బాలికల కళాశాలలో విద్యార్థులు ప్రతిజ్ఞను నిర్వహించారు. బాల్కొండలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ ఆధ్వర్యంలో కళాశాలలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. మాక్లూర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
బహుమతులను తహసీల్దార్ శంకర్, ఎంపీడీవో జయక్రాంతి అందజేశారు. మాక్లూర్ మండలంలోని దాస్నగర్ కళాశాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్ ఎం.సరిత విద్యార్థినులు ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె.లావణ్య, వైస్ప్రిన్సిపాల్ టి.వాసవిలత, అధ్యాపకులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో విద్యార్థులతో ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించినట్లు తహసీల్దార్ రాంచందర్ తెలిపారు. ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్ర లేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ బలరాం తెలిపారు. ఏర్గట్లలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల అవరణలో విద్యార్థిణులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.