నిజామాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి ఖండాంతరాల్లో మారుమోగడానికి ముమ్మాటికీ సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన పరిపాలనే కారణమని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల చెప్పా రు. స్వరాష్ట్రం సాకారం అయ్యాక విప్లవాత్మకమైన నిర్ణయాలతో రాష్ట్రం ముందుకు దూసుకుపోతున్న దని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, సుపరిపాలన సాధనలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా అనేక దేశాల్లో ప్రవాసులు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు విదేశాల్లో ఉపాధి అవకాశాల నిమిత్తం పరుగులు పెట్టుకుంటూ వచ్చిన ఎన్ఆర్ఐలకు ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణలో ఐటీ విస్తరణ వంటి చర్యల మూలంగా స్థానికంగానే ఉద్యోగావకాశాలు దొరకడం సంతోషమనిపిస్తున్న దని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీలో మేటిగా తెలంగాణ ఆవిర్భవించడం గొప్ప విషయమని తెలిపారు. శాంతి, భద్రతల పరిరక్షణతో పాటు పారిశ్రామికవేత్తల అవసరాలను తీర్చడంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండడం ఇందుకు కారణమని ఆయన వివరించారు. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్గా నిజామాబాద్లో ఐటీ విస్తరణకు తన పాత్ర తప్పక ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించిన ఆయన పలు విషయాలను వెల్లడించారు.
ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తు న్నాం. గ్లోబల్ బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్గా ఇప్పటికే పలు ప్రాంతాల్లో టూర్లు నిర్వహించాం. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ 52 దేశాల్లో పని చేస్తున్నది. దీంట్లో భాగంగా కేటీఆర్ ద్వారా జూమ్ మీటింగ్ కూడా ఇ ప్పటికే నిర్వహించాం. 500 మందితో కేటీఆర్ నేరు గా మాట్లాడి దశ,దిశను సూచించారు. వివిధ దేశా ల నుంచి 100 మంది తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్కు 30 మంది ఎన్ఆర్ఐలు వచ్చి ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను తీసుకెళ్లడంతో పాటు ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలన్న సందేశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాం. 100 నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించాం. మేము ఉంటున్న దేశాల్లో ఏం జరుగుతుంది? బయటి దేశాలకు ఇక్క డి పరిస్థితులకు తేడా లేకుండా మౌలిక సదుపాయాలను తెలంగాణ సర్కారు కల్పించిన విషయాలను విశదీకరించి చెబుతున్నాం. అలాంటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఓటర్లకు వివరిస్తున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థ ల్లో 50వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పరోక్షంగా మరిన్ని ఉద్యోగావకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. తద్వారా ఉపాధి లోటు కనిపించదు.
పదేండ్ల తెలంగాణలో సమ్మిళిత వృద్ధి సాధ్యమైంది. పారదర్శకమైన పరిపాలన, క చ్చితత్వమైన గవర్నెన్స్ మూ లంగానే ఇదంతా జరిగిం ది. కేసీఆర్ ముందుచూపు తో వ్యవసాయాన్ని స్థిరీకరించారు. పరిశ్రమలకు విద్యుత్, సాగునీటి కొరత లేకుండా చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంచి వాతావరణాన్ని క ల్పించారు. గ్లోబల్ సిటీ అ న్నట్లుగా హైదరాబాద్ను తీర్చిదిద్దడం ద్వారా పరిశ్రమలు తరలివచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. పారిశ్రామిక ప్రగతితో పా టు వ్యవసాయాభివృద్ధి మూలంగా తెలంగాణలో తలసరి ఆదాయం భారీగా పెరిగింది. తెలంగాణ వ చ్చిన తర్వాత తలసరి ఆదాయం, జీఎస్డీపీ మూ డు రెట్లు గ్రోత్ సాధించింది. 2014లో రూ.4.51లక్షల కోట్లు ఉన్న జీఎస్డీపీ ఇప్పుడేకంగా రూ. 13.13లక్షల కోట్లకు చేరింది. 2014లో తలసరి ఆదాయం రూ.1.24లక్షలుంటే ప్రస్తుతం రూ. 3.17లక్షలకు చేరింది. తెలంగాణలో స్థాపిత వి ద్యుత్ సామర్థ్యం 2014లో 7778 మెగావాట్లు ఉంటే 2021నాటికి 26వేల మెగావాట్లకు పెరిగిం ది. వ్యవసాయానికి సాగునీరు తెలంగాణ రాక ము నుపు కేవలం 62లక్షల ఎకరాలకు మాత్రమే అందుతుండేది. ఇప్పుడు 1.35కోట్ల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించబడింది. ఐటీ రంగంలో 2014లో ఉద్యోగాలు 3లక్షల 23వేల 396 ఉంటే 2023లో 9లక్షల 5వేల 715 కు చేరింది. ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి. 2014లో రూ.57వేల కోట్లు ఉండగా 2023లో 2.41లక్షల కోట్లకు చేరిందంటే తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అంచనా వేసుకోవచ్చు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో చేసిన కృషి ఫలితంగా నిజామాబాద్కు గ్లోబల్ లాజిక్ సంస్థను తీసుకు వస్తున్నాం. గ్లోబల్ లాజిక్ సంస్థ త్వరలోనే నిజామాబాద్ ఐటీ హబ్లో స్థాపించబోతున్నాం. ఎన్నికల తర్వాత పనులు మొదలు పెడతారు. వచ్చే నెలలో కార్యకలాపాలు షురూ అయ్యే అవకాశాలున్నాయి. గ్లోబల్ లాజిక్ సంస్థలో ప్రస్తు తం 30వేల మంది పని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ కంపెనీకి అనుబంధ ఐటీ సంస్థ. నిజామాబాద్ లాంటి పట్టణానికి గ్లోబల్ లాజిక్ సంస్థ రావడం ఈ ప్రాంత యువత అదృష్టం. ఇండియాలో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్కు తీసుకువస్తున్నాం. 250 మందికి ప్రాథమికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతాయి. హైదరాబాద్లో 3వేల మందికి పైగా యువత గ్లోబల్ లాజిక్లో పని చేస్తున్నారు. ఇలా ఐటీలో యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఎమ్మెల్సీ కవితతో కలిసి వీలైనన్ని కొత్త ప్రాజెక్టులు నిజామాబాద్కే తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిజామాబాద్లో ప్రస్తుతం ఉన్న ఐటీ టవర్ వెనుక భాగంలోనే మరో ఐటీ టవర్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల సహకారంతో కృషి చేస్తున్నాం. సెకండ్ టవర్ నిర్మాణం కోసం కేటీఆర్తోనూ మాట్లాడాం. తప్పకుండా సహకారం అందిస్తామన్నారు. నేను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో అనేక దేశాలు పర్యటించాను. కేటీఆర్ పనితీరు చూశాక… తెలంగాణకు రావడానికి అనేక కంపెనీలు ఇష్టపడుతున్నాయి. ఇండియాలో ఏ పెట్టుబడికి వచ్చినా తెలంగాణకే పట్టుకొచ్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారు. నా వరకు తెలంగాణకు వచ్చే ఐటీ కంపెనీలను నిజామాబాద్కు తేవాలి అన్నదే ఆలోచన.