ముప్కాల్, జనవరి 16 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,ముప్కాల్ ఎంపీపీ సామ పద్మ భర్త సామ వెంకట్ రెడ్డిపై సోమవారం ఉదయం దాడి జరిగింది. గడ్డం సంతోష్ ఆయన తమ్ముడు గడ్డం దిలీప్, గడ్డం సంతోష్ కుమారుడు గడ్డం సాయిరెడ్డి మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద ఒక్కసారిగా వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
పథకం ప్రకారమే రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యయి. వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.